శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

27, మే 2022, శుక్రవారం

Shani Trayodashi - శని త్రయోదశి


తేది. 28-05-2022 న శని త్రయోదశి. ఈ నెలలో పౌర్ణమి ముందు కూడా ఈ శని త్రయోదశి వచ్చినది. అయితే అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశికు ప్రాధాన్యత ఎక్కువ.
శని త్రయోదశి నాడు శనైశ్చరునకు ప్రీతిని కలిగించినట్లయితే ఆయన బాధించడు. అందువలన ఈ రోజున చేయు అభిషేకమునకు ప్రాధాన్యత ఎక్కువ.

మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర స్వామిని(శని భగవానుడు) ఆరాధించుట వలన ''శని బాధల'' నుండి విముక్తి కలుగును.

ఏలిన నాటి శని పీడ గల రాశులు

*మీనం*
*కుంభం*
*మకరం*

*అర్ధాష్టమ శని* పీడ గలరాశి

*వృశ్చికము*

*అష్టమ శని* బాధ గల రాశి

*కర్కాటకము*

అలాగే *శని దశలు*, *అంతర్దశలు*, బాగాలేని వారుకూడా ఈ మందేశ్వరుని ఆరాధించవచ్చు.

Shani Trayodashi : రేపు శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే!

శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి నువ్వులతో అభిషేకం చేసిన అనంతరం నీలిరంగు పుష్పాలను సమర్పించి పూజించాలి.

ఈ విధంగా స్వామివారికి నీలిరంగు పుష్పాలతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా శని త్రయోదశి రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా కాకులకు ఆహారంగా పెట్టిన అనంతరం నల్లని వస్త్రంలో నువ్వుల నూనె, నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ శని త్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే ప్రీతికరమైనది కాదు ఈ శని త్రయోదశి శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనది. అందుకే పెద్ద ఎత్తున శివకేశవులకు కూడా పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శివకేశవులు అశ్వత్థ వృక్షంలో కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అందుకే ఈ శని త్రయోదశి రోజున అశ్వర్థ వృక్షానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అందుకే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు శనీశ్వర ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడంతో పాటు అశ్వత్థ వృక్షానికి కూడా పూజలు చేస్తారు.

17, మే 2022, మంగళవారం

గ్రహవిచికిత్స

గ్రహాల ద్వారా కలిగే అనారోగ్యాల నివారణ ...

గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి పరాక్రి జ్యోతిర్వైద్య సిద్ధాంతం.

Copyright content © parakrijaya

 వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.

కాల్షియంకు ము త్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడు అది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.

ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగ డం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం.

బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్ప డే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చం ద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని- వాత లక్షణం కలవాడు.చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. . సప్త గ్ర హాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనం ద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సా మ్రాజ్యాన్ని మ నమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.


Copyright content © parakrijaya

Parakri Audio Mantras



cell: 9966455872

Astrology Blog శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం
Devotional Blog సాధన ఆరాధన
Telugu Literature Blog తెలుగు పండిత దర్శిని
My Writings - Blog పరాక్రి పదనిసలు contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...