శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

17, నవంబర్ 2025, సోమవారం

కృష్ణ అంగారక చతుర్దశి

18.11.2025. మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు

సుప్రభాతం......

ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి ఉదయం 07.12 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *స్వాతీ* నక్షత్రం ఈరోజు పూర్తిగా, *ఆయుష్యాన్* యోగం ఉ.07.12 వరకూ తదుపరి *సౌభాగ్య* యోగం, *వణిజ* కరణం ఉ.07.12 వరకూ, *భద్ర(విష్టీ)* కరణం రా.08.27 వరకూ తదుపరి *శకుని* కరణం ఉంటాయి. 

ఈరోజు మాస శివరాత్రి బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తిథి కలసి ఉన్న రోజు శివ రాత్రి పండుగ జరుపుకోవడానికి అత్యంత అనుకూలం.

ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. మంగళ వారం రోజు బహుళ పక్ష చతుర్దశి ఉన్న రోజు ని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు సూర్య గ్రహణం పట్టిన రోజంత పుణ్య దినం అనీ, పుణ్య నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి, యమ తర్పణం ఇవ్వడం మిక్కిలి ఫల ప్రదం అని పురాణ వచనం.

తిథి శూన్య నక్షత్రం నిన్న తెల్లవారుఝాము 04.47 నుండి ఈరోజు ఉదయం 07.12 వరకూ ఉంటుంది. ఏ మాసం లో అయినా త్రయోదశి తిథి వ్యాప్తి ఉన్నరోజు, చిత్త స్వాతీ నక్షత్రాలు వచ్చినట్లయితే, చిత్త స్వాతీ నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడానికి అనుకూలం కాదు.

24, అక్టోబర్ 2025, శుక్రవారం

నాగులచవితి విశిష్టత

నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, 
Nagula Chavithi Good Wihses to All
నాగులచవితి విశిష్టత 

ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది.  *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు. 

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో*  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 

నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 

దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.

కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’*  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని*  పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

*నాగుల చవితి మంత్రం*
పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.

*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*

 *నడుము తొక్కితే నావాడు అనుకో* 
 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 
 *తోక తొక్కితే తోటి వాడు అనుకో* 
 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 

ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.

 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

 ఫలశృతి: 
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏
ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.
🐍🐍🐍🐍🐍


 సర్ప సూక్తం

బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః
🌹 🌹 🌹 🌹 🌹





అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

21, అక్టోబర్ 2025, మంగళవారం

కార్తీక మాస నియమాలు

🏮🪔🏮🪔🏮🪔🏮🪔🏮

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి?
విధానాలు తెలుసుకుందా..!!

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసోన శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 

ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం 

*కార్తీక శుద్ధ పాడ్యమి :*
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

*విదియ :*
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

*తదియ :*
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

*చవితి :*
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

*పంచమి :*
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్ఠి :*
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

*సప్తమి :*
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

*అష్టమి :*
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

*నవమి :*
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి :*
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి :*
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

*ద్వాదశి :*
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

*త్రయోదశి :*
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

*చతుర్దశి :*
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

*కార్తీక పూర్ణిమ :*
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి :*
ఆకుకూర దానం చేస్తే మంచిది.

*విదియ :*
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

*తదియ :*
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

*చవితి :*
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

*పంచమి :*
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

*షష్ఠి :*
గ్రామదేవతలకు పూజ చేయాలి.

*సప్తమి :*
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

*అష్టమి :*
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

*నవమి :*
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

*దశమి :*
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

*ఏకాదశి :*
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

*ద్వాదశి :*
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

*త్రయోదశి :*
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

*చతుర్దశి :*
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

*అమావాస్య :*
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..

కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు

*🌺మొదటి రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
*దానములు* :- 
నెయ్యి, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
స్వథా అగ్ని
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
*ఫలితము* :- 
తేజోవర్ధనము

*🌺2 వరోజు* :

*నిషిద్ధములు* :- 
తరగబడిన వస్తువులు
*దానములు* :- 
కలువపూలు, నూనె, ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
బ్రహ్మ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గీష్పతయే - విరించియే స్వాహా
*ఫలితము* :- 
మనః స్థిమితము

*🌺3 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉప్పు కలిసినవి, ఉసిరి
*దానములు* :- 
ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
పార్వతి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
*ఫలితము* :- 
శక్తి, సౌభాగ్యము

*🌺4 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
వంకాయ, ఉసిరి
*దానములు* :- 
నూనె, పెసరపప్పు
*పూజించాల్సిన దైవము* :- 
విఘ్నేశ్వరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గం గణపతయే స్వాహా
*ఫలితము* :- 
సద్బుద్ధి, కార్యసిద్ధి

*🌺5 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపుతో కూడినవి
*దానములు* :- 
స్వయంపాకం, విసనకర్ర
*పూజించాల్సిన దైవము* :- 
ఆదిశేషుడు
*జపించాల్సిన మంత్రము* :- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
*ఫలితము* :- 
కీర్తి

*🌺6 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఇష్టమైనవి, ఉసిరి
*దానములు* :- 
చిమ్మిలి
*పూజించాల్సిన దైవము :-* 
సుబ్రహ్మణ్యేశ్వరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
*ఫలితము* :- 
సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

*🌺7 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పంటితో తినే వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
సూర్యుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం. భాం. భానవే స్వాహా
*ఫలితము* :- 
తేజస్సు, ఆరోగ్యం

*🌺8 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
*దానములు* :- 
తోచినవి - యథాశక్తి
*పూజించాల్సిన దైవము* :- 
దుర్గ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
*ఫలితము* :- 
ధైర్యం, విజయం

*🌺9 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
*పూజించాల్సిన దైవము :-* 
అష్టవసువులు - పితృ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
*ఫలితము* :- 
ఆత్మరక్షణ, సంతాన రక్షణ

*🌺10 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
గుమ్మడికాయ, నూనె, ఉసిరి
*దానములు* :- 
గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
*పూజించాల్సిన దైవము* :- 
దిగ్గజాలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం మహామదేభాయ స్వాహా
*ఫలితము* :- 
యశస్సు - ధనలబ్ధి

*🌺11 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపు, ఉసిరి
*దానములు* :- 
వీభూదిపండ్లు, దక్షిణ
*పూజించాల్సిన దైవము* :- 
శివుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
*ఫలితము* :- 
ధనప్రాప్తి, పదవీలబ్ధి

*🌺12 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
*దానములు* :- 
పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
*పూజించాల్సిన దైవము*:- 
భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
*ఫలితము* :- 
బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

*🌺13 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
రాత్రి భోజనం, ఉసిరి
*దానములు* :- 
మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
*పూజించాల్సిన దైవము :-* 
మన్మధుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
*ఫలితము* :- 
వీర్యవృద్ధి, సౌందర్యం.

*🌺14 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఇష్టమైన వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
*పూజించాల్సిన దైవము* :- 
యముడు
*జపించాల్సిన మంత్రము*:- 
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
*ఫలితము* :- 
అకాలమృత్యువులు తొలగుట

*🌺15వ రోజు :*

*నిషిద్ధములు* :- 
తరగబడిన వస్తువులు
*దానములు* :- 
కలువపూలు, నూనె, ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
కార్తీక దామోదరుడు.
*జపించాల్సిన మంత్రము* :-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*🌺16 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
*దానములు* :- 
నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
స్వాహా అగ్ని
*జపించాల్సిన మంత్రము*:- 
ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
*ఫలితము* :- 
వర్చస్సు, తేజస్సు , పవిత్రత.

*🌺17 వ రోజు :*

*నిషిద్ధములు*:- 
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
*దానములు* :- 
ఔషధాలు, ధనం
*పూజించాల్సిన దైవము* :- 
అశ్వినీ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
*ఫలితము* :- 
సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

*🌺18 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉసిరి
*దానములు* :- 
పులిహార, అట్లు, బెల్లం
*పూజించాల్సిన దైవము* :- 
గౌరి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గౌర్త్యె స్వాహా
*ఫలితము* :- 
అఖండ సౌభాగ్య ప్రాప్తి

*🌺19 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, కుడుములు
*పూజించాల్సిన దైవము*:- 
వినాయకుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గం గణపతయే స్వాహా
*ఫలితము* :- 
విజయం, సర్వవిఘ్న నాశనం

*🌺20 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పాలుతప్ప - తక్కినవి
*దానములు* :- 
గో, భూ, సువర్ణ దానాలు
*పూజించాల్సిన దైవము* :- 
నాగేంద్రుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
*ఫలితము* :- 
గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

*🌺21 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
*దానములు* :- 
యథాశక్తి సమస్త దానాలూ
*పూజించాల్సిన దైవము* :- 
కుమారస్వామి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
*ఫలితము* :- 
సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

*🌺22 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
*దానములు* :- 
బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
*పూజించాల్సిన దైవము* :- 
సూర్యుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
*ఫలితము* :- 
ఆయురారోగ్య తేజో బుద్ధులు

*🌺23 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉసిరి, తులసి
*దానములు* :- 
మంగళ ద్రవ్యాలు
*పూజించాల్సిన దైవము* :- 
అష్టమాతృకలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
*ఫలితము* :- 
మాతృరక్షణం, వశీకరణం

*🌺24 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
మద్యమాంస మైధునాలు, ఉసిరి
*దానములు*:- 
ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
*పూజించాల్సిన దైవము* :- 
శ్రీ దుర్గ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
*ఫలితము* :- 
శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

*🌺25 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
*దానములు* :- 
యథాశక్తి
*పూజించాల్సిన దైవము* :- 
దిక్వాలకులు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం ఈశావాస్యాయ స్వాహా
*ఫలితము* :- 
అఖండకీర్తి, పదవీప్రాప్తి

*🌺26 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
సమస్త పదార్ధాలు
*దానములు* :- 
నిలవవుండే సరుకులు
*పూజించాల్సిన దైవము :-* 
కుబేరుడు
*జపించాల్సిన మంత్రము :-* 
ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
*ఫలితము* :- 
ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

*🌺27 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, వంకాయ
*దానములు* :- 
ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
*పూజించాల్సిన దైవము* :- 
కార్తీక దామోదరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
*ఫలితము* :- 
మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

*🌺28 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
*దానములు* :- 
నువ్వులు, ఉసిరి
*పూజించాల్సిన దైవము* :- 
ధర్ముడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
*ఫలితము* :- 
దీర్ఘకాల వ్యాధీహరణం

*🌺29 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
పగటి ఆహారం, ఉసిరి
*దానములు* :- 
శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
శివుడు (మృత్యుంజయుడు)
*జపించాల్సిన మంత్రము* :- 
ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
*ఫలితము :-* 
అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

*🌺30 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పగటి ఆహారం, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, తర్పణలు, ఉసిరి
*పూజించాల్సిన దైవము* :- 
సర్వదేవతలు + పితృ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
*ఫలితము* :- 
ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

స్వస్తి..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🏮🪔🏮🪔🏮🪔🏮🪔🏮

6, మే 2025, మంగళవారం

మే నెలలో గ్రహాల మార్పుతో వ్యక్తిగత జాతకాలపై ప్రభావం


         మే నెలలో గ్రహాల మార్పు విశేషంగా ఉంటుంది. మే 6న బుధుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది మానసిక స్పష్టతను పెంచే అవకాశం ఉంది.

 మే 14న, రవి మేష నుండి వృషభం రాశికి ప్రవేశిస్తాడు, అదే రోజున గురుడు కూడా వృషభం నుండి మిథున రాశికి మారుతాడు, ఇది ఆర్థిక విషయాలపై ప్రభావం చూపించవచ్చు. 

మే 18న, రాహు మీన నుండి కుంభ రాశికి మారుతాడు, అలాగే కేతు కన్య నుండి సింహ రాశికి చేరుకుంటాడు, దీని ప్రభావం వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రత్యేకంగా కనిపించవచ్చు. 

మే 31న, శుక్రుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది సంబంధాలలో మరియు సౌందర్యంతో కూడిన అంశాల్లో మార్పును తెచ్చే అవకాశం ఉంది.

 ఈ గ్రహాల మార్పు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అంశాలను ప్రభావితం చేయనుంది.


Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

30, మే 2024, గురువారం

జూన్ నెలలో పర్వదినాలు -Parvadinalu june


తేదీ 01-06-2024 శనివారం 
*హనుమాన్ జయంతి*

తేదీ 02-06-2024 ఆదివారం 
*వైశాఖ బహుళ ఏకాదశి*

తేదీ 05-06-2024 బుధవారం 
*వైశాఖ బహుళ చతుర్దశి మాసశివరాత్రి*

తేదీ 06-06-2024 గురువారం 
*వైశాఖ బహుళ అమావాస్య*

తేదీ 17-06-2024 సోమవారం 
*జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి*

తేదీ 22-06-2024 శనివారం 
*పూర్ణిమ*

తేదీ 25-06-2024 మంగళవారం 
*సంకటహర చతుర్థి*

తేదీ 02-07-2024 మంగళవారం 
*జ్యేష్ఠ బహుళ ఏకాదశి*

తేదీ 04-07-2024 గురువారం 
*జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాసశివరాత్రి*

తేదీ 05-07-2024 శుక్రవారం 
*జ్యేష్ఠ బహుళ అమావాస్య*

18, అక్టోబర్ 2023, బుధవారం

దసరా 2023

శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు...!!!
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి...!

👉 *శ్రీ బాల త్రిపుర‌సుందరీ‌ దేవి (15-10-2023) : ఈరోజు అమ్మవారి లేత గులాబీ రంగు లేదా పసుపురంగు చీర కడతారు. అమ్మవారికి ఎరుపు రంగు మందార పూవులతో పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పులిహోర, పరమాన్నం నైవేద్యం పెడతారు. ఈరోజు రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది. ఈరోజు పదేళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి బట్టలు పెడతారు...!*

👉 *శ్రీ గాయత్రీ దేవి (16-10-2023) : అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది...!*

👉 *శ్రీ అన్నపూర్ణా దేవి (17-10-2023) : సకల జీవులకు అన్నం ఆధారం. కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి...!*

👉 *శ్రీ మహాలక్ష్మి దేవి (18-10-2023) : మహాలక్ష్మీ దేవిని పూజిస్తే ధన ధాన్యాలకు లోటుండదు. విద్యా, సంతానం వరాలుగా పొందుతారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి తెల్ల కలువలతో పూజ చేస్తే మంచిది. క్షీరాన్నం, పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు దక్షిణ దానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది...!*

👉 *శ్రీ మహా చండీ దేవి (19-10-2023) : మహా చండీ దేవి ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది...!*

👉 *శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం – 20-10-2023): ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. గులాబీలు, తెల్ల చామంతులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి నైవేద్యం పెడతారు. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది...!*

👉 *శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి (21-10-2023) : ఈరోజు అమ్మవారు బంగారు రంగుచీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువ పూలతో పూజ చేస్తే మంచిది. అమ్మవారికి నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెట్టాలి. సహస్రనామ పుస్తకాలు ఈరోజు దానం చేస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజ చేయడం వీలు పడని వారు మొదటి మూడు రోజులు లేదా తరువాత మూడు రోజులు లేదా చివరి మూడురోజులు పూజిస్తారు...!*

👉 *శ్రీ దుర్గాదేవి అలంకారం (22-10-2023) : ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు...!*

👉 *శ్రీ మహిషాసురమర్దనీ దేవి మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి (23-10-23) : దేవీ నవరాత్రులు చివరి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్దనీ దేవిగా కనిపిస్తారు. నవమి తిథి ఉదయం వరకు మాత్రమే ఉండటం.. మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుండటంతో ఈరోజు రెండు అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు అమ్మవారు ఎరుపురంగు చీరలో దర్శనం ఇస్తారు. పాయసం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి. పూల మాలలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి అఖండ కీర్తి, సౌభాగ్యం కలుగుతుంది. దశమి రోజు ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు...!!!*

For astrology related services :

https://t.me/telugujyotishanilayam
Telegram Astrology group జ్యోతిష విషయాలు 

Facebook page 
https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM/

https://www.facebook.com/teluguastrology

Contact : 9966455872 
P.V.Radhakrishna or jayamaheswari
parakrijaya@gmail.com

Or
Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

Our site :
http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com

@telugujyotishanilayam

 🥥🎋🌻🪔🌻🌾🪙

28, అక్టోబర్ 2022, శుక్రవారం

నాగుల చవితి విశిష్టత

ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది

నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు కాలసర్పదోషం, నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పాటించాలి.

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు.

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం!

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!

నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.

ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే!🙏🌼🌿

🌿🌼🙏కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం🙏🌼🌿

🌿🌼🙏నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం🙏🌼🌿

🌿🌼🙏నవ నాగ స్తోత్రం🙏🌼🌿

అనంతం వాసుకిం శేష
పద్మనాభంచ కంబలం
శంఖుపాలం ధృతరాష్ట్రంచ
తక్షకం కాళీయం తథా

ఫలశ్రుతి

ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|


సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం

@teluguastrology

తైత్తిరీయ సంహితా - ౪.౨.౮

ఋగ్వేదము

నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః | యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః ||

ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||

నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ||

🌿🌼🙏 ఇతి సర్ప సూక్తం 🙏🌼🌿

భుజంగేషాయ విద్మహే
క్షక్షు శివాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాత్!

ఈ మంత్రం నాగ విగ్రహానికి  పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలని, అందరికీ ఆ భగవంతుని అనుగ్రహము కలగాలని ఆకాంక్షిస్తూ ...

https://www.facebook.com/teluguastrology

ఓం నమో భగవతే నాగరాజాయ

29, ఆగస్టు 2022, సోమవారం

ఏకవింశతి పత్రాలు పూజ విధానం


గణపతి ఏకవింశతి పత్రాలు పూజ విధానం 

బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, స్కాంద, గణేశ, ముద్దల పురాణాల్లో గణపతి లీలా విలాస వైభవం వర్ణించబడింది.


గణపతి ఏకవింశతి పత్రపూజ కల్పములో విధించబడి, పవింశతి నామములతో కీర్తింప బడుతున్నాడు. పంచభూతము, పంచ తన్మత్రలు, దశేంద్రియములు,మనస్సు అను 21. ఏకవిం శతి తత్త్వముపై గణపతికి అధికారము గలదు. కనుక ఏక వింశతి నామములు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఓం సుముఖా యనమః, మాచీపత్రం పూజాయామి, అని మాచీ పత్రిని,బృహతీపత్రం పూజాయామి అని బృహతీపత్రిని ఇలా 21 పత్రాలతో స్వామి వారిని పూజిస్తే మనకి శారీరకంగా చాలా ఆరోగ్యం కలుగుతుంది
"ఏక వింశతి పత్రి పూజ"

1. మాచీ పత్రం (మాచి పత్రి)
 2. బృహతీ పత్రం (వాకుడు)
 3. బిల్వ పత్రం (మారేడు)
4. దూర్వాలు (గరిక)
 5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
 6. బదరీ పత్రం (రేగు)  
 7. అపామార్గ పత్రం (ఉత్తరేణి)
 8. తులసీ పత్రం (తులసి)
 9. చూత పత్రం (మామిడి)
 10. కరవీర పత్రం (గన్నేరు)
 
11. విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)
 12. దాడిమీ పత్రం (దానిమ్మ)
 13. దేవదారు పత్రం
14. మరువక పత్రం (మరువం)
 15. సింధువార పత్రం (వావిలి)
 16. జాజీ పత్రం (జాజి)
17. గండకీ పత్రం (దేవకాంచనం)
 18. శమీ పత్రం (జమ్మి)
 19. అశ్వత్థ పత్రం (రావి)
 20. అర్జున పత్రం (మద్ది)
 21. ఆర్క పత్రం (జిల్లేడు)


గణేశుని  పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.
 

సం. వినాయకుని నామము  పత్రి పూజయామి తెలుగు పేరు 
1. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి మాచిపత్రి
2. ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి వాకుడు
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి మారేడు
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక 
5. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్త
6. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగు 
7. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గ పత్రం పూజయామి ఉత్తరేణి
8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి తులసి
9. ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి మామిడి
10. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి ఎర్ర గన్నేరు
11. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుకాంత
12. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ
13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు
14. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువం
15. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి
16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి జాజి
17. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దేవకాంచనం
18. ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి 
19. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి రావి
20. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్ది
21. ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి జిల్లేడు

గణపతి ఏకవింశతి పత్రపూజ

      వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. 

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, 
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. 

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, 
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. 

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, 
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. 

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, 
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! 

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, 
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. 

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, 
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, 
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః . 

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.

నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, 
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.

 

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.

9, జులై 2022, శనివారం

మేధాదక్షిణామూర్తి - Medha Dakshinamurthy

శ్రీ మేధాదక్షిణామూర్తి మంత్రః
ఓం అస్య శ్రీ మేధాదక్షిణామూర్తి మహామంత్రస్య శుకబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధాదక్షిణామూర్తిర్దేవతా మేధా బీజం ప్రజ్ఞా శక్తిః స్వాహా కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ :–

భస్మం వ్యాపాణ్డురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా |
వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః ||
వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైస్సేవ్యమాన ప్రసన్నః |
సవ్యాలకృత్తివాసాస్సతతమవతు నో దక్షిణామూర్తిమీశః ||
మూలమంత్రః –
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

27, మే 2022, శుక్రవారం

Shani Trayodashi - శని త్రయోదశి


తేది. 28-05-2022 న శని త్రయోదశి. ఈ నెలలో పౌర్ణమి ముందు కూడా ఈ శని త్రయోదశి వచ్చినది. అయితే అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశికు ప్రాధాన్యత ఎక్కువ.
శని త్రయోదశి నాడు శనైశ్చరునకు ప్రీతిని కలిగించినట్లయితే ఆయన బాధించడు. అందువలన ఈ రోజున చేయు అభిషేకమునకు ప్రాధాన్యత ఎక్కువ.

మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర స్వామిని(శని భగవానుడు) ఆరాధించుట వలన ''శని బాధల'' నుండి విముక్తి కలుగును.

ఏలిన నాటి శని పీడ గల రాశులు

*మీనం*
*కుంభం*
*మకరం*

*అర్ధాష్టమ శని* పీడ గలరాశి

*వృశ్చికము*

*అష్టమ శని* బాధ గల రాశి

*కర్కాటకము*

అలాగే *శని దశలు*, *అంతర్దశలు*, బాగాలేని వారుకూడా ఈ మందేశ్వరుని ఆరాధించవచ్చు.

Shani Trayodashi : రేపు శని త్రయోదశి… ఈ వస్తువులు దానం చేస్తే అంతా శుభమే!

శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి నువ్వులతో అభిషేకం చేసిన అనంతరం నీలిరంగు పుష్పాలను సమర్పించి పూజించాలి.

ఈ విధంగా స్వామివారికి నీలిరంగు పుష్పాలతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా శని త్రయోదశి రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా కాకులకు ఆహారంగా పెట్టిన అనంతరం నల్లని వస్త్రంలో నువ్వుల నూనె, నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ శని త్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే ప్రీతికరమైనది కాదు ఈ శని త్రయోదశి శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనది. అందుకే పెద్ద ఎత్తున శివకేశవులకు కూడా పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శివకేశవులు అశ్వత్థ వృక్షంలో కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అందుకే ఈ శని త్రయోదశి రోజున అశ్వర్థ వృక్షానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అందుకే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు శనీశ్వర ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడంతో పాటు అశ్వత్థ వృక్షానికి కూడా పూజలు చేస్తారు.

17, మే 2022, మంగళవారం

గ్రహవిచికిత్స

గ్రహాల ద్వారా కలిగే అనారోగ్యాల నివారణ ...

గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వారా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి పరాక్రి జ్యోతిర్వైద్య సిద్ధాంతం.

Copyright content © parakrijaya

 వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.

కాల్షియంకు ము త్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడు అది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.

ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగ డం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం.

బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్ప డే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చం ద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని- వాత లక్షణం కలవాడు.చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. . సప్త గ్ర హాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనం ద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సా మ్రాజ్యాన్ని మ నమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.


Copyright content © parakrijaya

Parakri Audio Mantras



cell: 9966455872

Astrology Blog శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం
Devotional Blog సాధన ఆరాధన
Telugu Literature Blog తెలుగు పండిత దర్శిని
My Writings - Blog పరాక్రి పదనిసలు contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

చైత్ర మాసం విశిష్టత

రేపటి నుండి చైత్ర మాసం ప్రారంభం
చైత్ర మాసం విశిష్టత

*“ఋతూనాం కుసుమాకరాం”* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.
ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.

ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.

పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.

చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు
సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 

చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.

చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.

చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 
పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.
అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.

చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.

చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.

చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.

చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.

చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.
ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాము.

#ఉగాది

6, డిసెంబర్ 2020, ఆదివారం

కాలభైరవ జయంతి

రేపు కాలభైరవ జయంతి అనగా 07/12/2020


కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం ~ పూజా విధానం

ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలామంది *కుక్క(శునకం)* అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయనను పూజించినచో కాలమును మార్చలేకపోయినా మనకు అనుకూలంగా మలచుకోవచ్చు.

ముఖ్యంగా 
అసితాంగ భైరవుడు , రురు భైరవుడు , 
చండ భైరవుడు , 
క్రోధ భైరవుడు , 
ఉన్మత్త భైరవుడు , 
కపాల భైరవుడు , 
భీషణ భైరవుడు , 
సంహార భైరవుడు , అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.


కాలభైరవ వృత్తాంతం : -


పరమశివుడిని అవమానపరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.

శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు , అపమృత్యు దోషాలు తొలగిపోతాయని , ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి.

దేవాలయములలో క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా అయన దర్శనం చేయవలెను.

*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*
*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*

పూజా విధానం  : -

శ్రీ కాలభైరవ పూజని అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవ పూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికిగాని , చిత్రపటానికిగాని పూజ చేయవచ్చు. శనివారం , మంగళవారాలు కలభైరవుడికి అత్యంత ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని సాయంత్రం 5 – 7 గం..ల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

పూజను చేయలేనివారు *శ్రీ కాలభైరవాష్టకం , భైరవ కవచం , స్తోత్రాలు* పఠించడంవల్ల భైరవానుగ్రహాన్నీ పొందవచ్చు.


కాలభైరవాష్టకం


*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*
*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*

*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*
*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*

*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*
*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*

*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*
*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*

*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*
*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*

*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*
*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*

*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*
*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*

*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*
*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*

*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*
*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*


 
సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూప.

కాలము  అనబడే కుక్కను వాహనంగా  కలిగి ఉంటాడు కనుక. ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి , నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని…  గద , త్రిశూలం , సర్పం , పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం.  ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

శ్రీ కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో  అభిశేకము చేయించి , గారెలతో మాల వేసి… కొబ్బరి , బెల్లం నైవేద్యంగా పెట్టినచో జాతకంలో వున్న సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో  ఆయుష్షు పెరుగును.

అంతేకాక  ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించినచో భైరవుని అనుగ్రహం వల్ల అష్టమ , అర్ధాష్టమ , ఏలినాటి శని దోషములు ఉన్నవారు శనిదోషాల నుంచి విముక్తులు కాగలరు.

శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శన చేసి . భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం  తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.


*కాలభైరవ గాయత్రి*

*ఓం కాల కాలాయ విద్మహే*
*కాలాతీతాయ ధీమహి*
*తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ॥*



కాలభైరవ జయంతి పై ముఖ్యమైన  సమయాలు

సూర్యోదయం డిసెంబర్ 07, 2020 6:47 అపరాహ్నం
సూర్యాస్తమయం డిసెంబర్ 07, 2020 5:37 అపరాహ్నం
అష్టమి తిథి ప్రారంభమైంది డిసెంబర్ 07, 2020 6:47 అపరాహ్నం
అష్టమి తిథి ముగుస్తుంది డిసెంబర్ 08, 2020 5:17 అపరాహ్నం

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...