శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
నవగ్రహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవగ్రహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

నవగ్రహాలు - చంద్రుడు

చంద్రుడు :

చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాంవర్ణనలకుకంటే మిన్నగా 
చంద్రుడు చాల అందమైన వాడుపది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని  
అధిరోహిస్తాడునిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం 
చేసే వాడుఅనిపేర్లు కూడా కలవుఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,
ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడుతండ్రి సోమతల్లి తారక. 
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లిచర్మ వ్యాధులు మొదలైన 
 సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడుతూర్పుదక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం

22, జూన్ 2014, ఆదివారం

నవగ్రహాలు



నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ!
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:!!
అనే మంత్రం చాలామందికి తెలిసిందే. సాధార ణంగా నవగ్రహ దేవస్థానాలలో 'ఆదిత్యాయ చ సోమాయ అనే మంత్రాన్ని చూస్తూ ఉంటాం. నమస్సూర్యాయ అనే మంత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

'నమస్సూర్యాయ మంత్రాన్ని తమిళనాడు ప్రజలు ఎక్కువగా చెబుతుం టారు. ఇందులో ఒక వేద రహస్యం ఉన్నది. వేదం ఉపదేశించిన సూర్య ద్వాదశాక్షరిలో సూర్య అనే పదం కనిపిస్తుంది.

సూర్యుడు: 
'సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ. చరాచర జగత్తుకు సూర్యుడే ఆత్మ. ఆ సూర్యుడే పరబ్రహ్మ లేదా పరబ్రహ్మే సూర్యుడు - అనేది వేదం ఉపదేశించిన రహస్యం.

ప్రజలను కర్మలో ప్రేరేపిస్తాడు కనుక ఆయనకు సూర్యుడు అని పేరు. ఈయన ఒక సంవత్సర కాలంలో నెలకొక రాశి చొప్పున సంచరిస్తాడు. సూర్యుడు పితృ, ఆత్మ, శక్తుల కారకుడు. సూర్య ఆరాధనతో హృదయ రోగాలు తగ్గిపోతాయి.

సూర్యశాంతికై ఆదిత్యహృదయాన్ని పఠించాలి. ఈ స్తోత్రం ఆరోగ్యాన్నీ, జయాన్నీ కూడా అనుగ్రహిస్తుంది. సింహరాశి సూర్యుడి స్వస్థానం కనుక ఈ రాశివారు సూర్యారాధన చేయాలి. సూర్యుడి రత్నం కెంపు. సూర్యుడి ప్రీతికై హోమంలో వాడవలసిన సమిధ జిల్లేడు.

చంద్రుడు: 
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కనుక చంద్రుడు అని పేరు. ఈయన అత్రి పుత్రుడు కనుక దత్తభక్తులకు దగ్గరివాడు. మనశ్శాంతిని ఇచ్చే వాడు. పరమాత్మ మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు కనుక మనశ్శాంతికై ఆయనను ప్రార్థించాలి.

చంద్రుడి స్వక్షేత్రం కర్కాటకం. ఆ రాశివారు చంద్రుడిని అర్చించాలి. చంద్రుడి రత్నం ముత్యం. ఈయనకు శివుడు తన శిరస్సుపై స్థానాన్ని ఇచ్చాడు కనుక చంద్రశాంతికై శివప్రార్థన చెయ్యాలి. చంద్రడు కాశీక్షేత్రంలో తపస్సుచేసి శివానుగ్రహాన్ని పొందాడు. మోదుగ సమిధను చంద్రప్రీతికై హోమంలో వినియోగించాలి. చంద్రుడిని ధ్యానిస్తే మన:పీడలు పరిహారమవు తాయి.   

మంగళుడు :
 సుఖాన్ని ఇస్తాడు కనుక ఆయనకు మంగళుడని పేరు. మంగళుడు భూమి పుత్రుడు. మండుతున్న బొగ్గులాగా ఉంటాడు కనుక ఈయనకు అంగారకుడని కూడా పేరు. ఈయన రత్నం పగడం.

మేషరాశివారు, వృశ్చికరాశివారు అంగారకుడిని ఆరాధించాలి. చండ్ర సమిధను అంగారక గ్రహ శాంతికై చేసే హోమంలో వేయాలి. ఆరాధనతో రోగపీడలు తొలగిపోతాయి.  

బుధుడు: అన్నిటినీ తెలుసుకొనేవాడు, తెలిపేవాడు కనుక ఆయనకు బుధుడని పేరు. కన్య, మిథునరాశులకు బుధుడు అధిపతి. ఆ రాశుల వారు బుధుడిని అర్చించాలి. ఈయన చంద్రుడి పుత్రుడు. అందుకే బుధుడిని సౌమ్యుడని కూడా పిలుస్తారు.

వృక్షసంపదను రక్షించేవారిని బుధుడు రక్షిస్తాడు. బుధానుగ్రహానికి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాలి.  పచ్చ బుధుడి రత్నం. అపామార్గం బుధుడి సమిధ. బుద్ధిపీడా పరిహారానికై బుధుడిని అర్చించాలి.

గురుడు: అన్ని అర్థాలనూ తెలిపేవాడు కనుక గురువు. బృహస్పతి దేవతల గురువు కనుక ఆయనకు గురువని పేరు.

ధనుర్మీనరాశులకు గురువు అధిపతి. ఆ రాశివారు గురుధ్యానం చేయాలి. అనేక సంకటాల నుండి దేవతలను రక్షించినట్టుగా ఈయన మానవులను కూడా రక్షిస్తూ ఉంటాడు. పుష్యరాగం గురుడి రత్నం. అశ్వత్థం (రావి) ఈయనకు సంబంధించిన సమిధ. గురుధ్యానంతో పుత్రపీడల నుంచి ముక్తి కలుగుతుంది.

శుక్రుడు:
 తెల్లని రంగులో మెరిసిపోతూ ఉంటాడు కనుక ఈయనకు శుక్రుడని పేరు. ఒకానొక సందర్భంలో రుద్రుడి రేతస్సు నుండి జన్మించాడు కనుక యానకు ఆపేరు వచ్చింది. దేవతలకు దు:ఖాన్ని కలిగించేవాడు కనుక శుక్రుడంటారని వ్యాఖ్యానించారు.

తుల,వృషభరాశులకు ఈయన అధిపతి. ఆ రాశి జాతకులు శుక్రుడిని స్మరించాలి. శుక్రుడిని శాంతపరచటానికి ధరించవలసిన రత్నం వజ్రం. దత్తుడికి ప్రియమైన ఔదంబరం శుక్రుడి సమిధ. పత్నీపీడ తొలగాలంటే శుక్రుడిని ప్రార్థించాలి.

శని: రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటూ, మెల్లగా సంచరిస్తాడు కనుక ఆయనకు శని అని పేరు. కుంభ, మకర రాశులకు శని నాయకుడు. ఆ రాశివారు శనైశ్చరుడిని స్మరిస్తే మంచిది. ఈయనకు సంబంధించిన రత్నం నీలం.

నలుపు, నీలం వస్త్రాలను ఈయన ఇష్టపడ తాడు. అంగవైకల్యం ఉన్నవారికి సేవ చేస్తే శని సంతోషిస్తాడు. జమ్మి సమిధలు శనికి సంబంధిం చినవి. శనైశ్చరుడు ప్రాణపీడా పరిహారకుడు.

రాహువు:
 సూర్యుడిని, చంద్రుడిని కబళించి విడిచిపెడతాడు కనుక ఆయనకు రాహువని పేరు. ఈయన అర్థకాయుడు. అఒంటే తల పాముగానూ, మొండెం మనిషిగానూ కలవాడని అర్థం.

రాహుప్రీతికై అమ్మవారిని ధ్యానించాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. రాహుశాంతికై గోమేధికాన్ని ధరించాలి. దూర్వలతో హోమం చేయాలి. కంటికి సంబంధించిన రోగాలు రాహుపూజతో ఉపశమిస్తాయి.

కేతువు:
 ఈయన వల్ల అన్నీ తెలుస్తాయి కనుక ఈయనకు కేతువని పేరు. కేతువంటే ధ్వజమనే అర్థం కూడా వుంది. అందరికీ విజయాన్ని ఇచ్చేవాడు కేతువు.

వైడూర్యం కేతుగ్రహానికి అనుకూలించే రత్నం. కేతుశాంతికై దర్భలతో హోమం చెయ్యాలి. కేతు ధ్యానంతో జ్ఞానపీడ పరిహరించబడుతుంది.
ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తోంది కనుక, అన్ని ఫలాలు భక్తులకు ఏకకాలంలో లభించాలంటే పై మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాల్సి ఉంటుంది.


30, మే 2014, శుక్రవారం

శుక్ర గ్రహానికి శాంతులు

  • శుక్రునికి ఇరవయ్ వేలు జపం+రెండువేలు క్షీరతర్పణం+రెండొందలు హోమం+ఇరవయ్ మందికి అన్నదానం చేసేది.
  • శుక్ర గ్రహ దోష నివారణార్థం శ్రీ లక్ష్మి దేవి, పరసు రాముడు ఆలయాలను సందర్సించాలి.
  • శుక్ర వారం రోజు అలసందులు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ధాన్యం మనం తినరాదు.
  • పాలతో చక్కర పొంగలిని చేసుకొని,ధునిలో వేయవలెను.
  • శ్రీ రాజ రాజేశ్వరి దేవి అష్టకాన్ని(లేదా) రాజ రాజేశ్వరి దేవి స్తవాన్ని రోజూ పటించాలి.
  • మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి.
  • చీమలకు పంచదార(చక్కర) ఆహారంగా వేస్తూ ఉండాలి.
  • దీపావళి పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి.


29, మే 2014, గురువారం

బృహస్పతి(గురువు)గురు గ్రహానికి శాంతులు

  • గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
  • గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
  • గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
  • ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
  • గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
  • తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
  • బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

28, మే 2014, బుధవారం

బుధ గ్రహ దోషానికి శాంతులు

  • బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చేసేది.
  • బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
  • బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)
  • పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.
  • ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.
  • బుధ గ్రహం బాగాలేనపుడు నపుమ్సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.
  • తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.
  • బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.
  • తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.




20, మే 2014, మంగళవారం

కుజ(అంగారక)గ్రహ దోషానికి శాంతులు


  • కుజునికి ఏడువేలు జపం+ఏడువందలు క్షీరతర్పణం+డెభై హోమం +ఏడుగురికి అన్నదానం చేసేది.
  • ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
  • మంగళవారం రోజున యెర్రని కుక్కలకు పాలు,రొట్టెలు ఆహారంగా వెయ్యాలి.
  • కుజగ్రహ దోష నివారణార్ధం ఆలయాలు దర్శించాలి. అవి కుమారా స్వామి,నరసింహ స్వామి,విష్ణు మూర్తి,ఆంజనేయ స్వామి ఆలయాలు.
  • కందులు,బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  • పేలాలు ధునిలో వేస్తూ పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యాలి.
  • సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి.



19, మే 2014, సోమవారం

చంద్ర గ్రహ దోషానికి శాంతులు

  • చంద్రునికి పది వేలు జపం+వెఇ క్షీరతర్పణం+వంద హోమం+పది మందికి అన్నదానం చేఇంచేది.
  • సోమవారం రోజున పేదలకు,సాధువులకు,ముష్టి వాళ్లకు అన్నదానం చేయుట(లేక)దద్దోజనం పంచి పెట్టాలి.
  • పది సోమవారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి,ఒకటింపావు కిలో బియ్యం బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  • సోమవారం రోజుల్లో గౌరీ,పార్వతి,కనకదుర్గ అమ్మవార్ల దేవాలయాలు దర్శించండి.
  • బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వెయ్యాలి.
  • బియ్యం,అరటిపండు,కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టవచ్చు. గమనిక:ఏరోజు ఆవుకి ఆహారంగా యీధన్యం పెడుతామో ఆరోజు ఆ ఆహారం తీసుకోరాదు.
  • రోజు రాత్రి పూట పడుకొనేముందు వెండిగ్లాస్ తో పాలు త్రాగి పడుకొనవలెను.
  • పది మాస శివ రాత్రులు శివునకు పాలాభిషేకం చేసి, తీర్థం స్వీకరించండి.

18, మే 2014, ఆదివారం

రవి గ్రహ దోషానికి శాంతులు




  • రవికి ఆరు వేలు జపం+ఆరువందలు క్షీరతర్పణం+అరవయ్ హోమం+ఆరుగురికి అన్నదానం చేసేది.
  • సూర్య దేవాలయాలను దర్శించుట: ౧.శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి దేవాలయం దర్శించి అరవయ్ ప్రదక్షిణాలు చెయ్యాలి. ౨.తమిళనాడు లోని సూర్యనార్ దేవాలయంలో సూర్య హోమం జరిపించుట.
  • రధ సప్తమి రోజున సముద్రస్నానమాచారించి,సూర్య నమస్కారాలు చేసి, సుర్యాష్టకాన్ని కనీసం ఆరు సార్లు జపించాలి.
  • పేదలకు,ముష్టివాల్లకు,సాధువులకు గోధుమ రొట్టెలు ఆదివారం రోజు పంచాలి.
  • ప్రతి రోజు ఆదిత్యహృదయం పటించాలి.
  • ఆరు ఆదివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆరవవారం ఒకకిలోపావు గోధుమలు,దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  • గోధుమలు,బెల్లం,కొద్దిగా మిరియాలు కలిపి ఆవుకి ఆహారంగా తినిపించేది. గమనిక:ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మీరు ఆ ఆహారం తీసుకోరాదు.

17, మే 2014, శనివారం

శని గ్రహానికి శాంతులు

  • శనికి పంతోమ్మిదివేలు( 19,000 ) జపం+పంతొమ్మిది వందలు క్షీరతర్పణం+నూట తొంభై హోమం+పంతొమ్మిది మందికి అన్నదానం చేసేది.
  • శనికి పంతొమ్మిది శని వారాలు తైలాభిషేకం చేఇంచి,నువ్వులు దానం ఇచ్చేది.
  • శని వారం రోజున నువ్వు ఉండలు పేదలకు,సాధువులకు పంచేది.
  • నవ గ్రహాలకు నలుభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసి,నువ్వులు దానం ఇచ్చేది.
  • ప్రతి రోజు మధ్యాహ్నం కాకులకు అన్నం కాని,బెల్లం కలిపినా నల్ల నువ్వులు కాని పెట్టాలి.
  • అయ్యప్ప స్వామీ దీక్ష మండలం రోజులు స్వీకరించాలి.
  • హనుమంతుని పూజించవచ్చు,ఉపాసన చేయవచ్చు.అనగా ఆన్జనేయాష్టకం,హనుమాన్ చాలీసా రోజూ పారాయణ చేయ వచ్చు.
  • శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేఇంచేది.
  • ప్రవహించే నీటిలో బొగ్గులు,మేకు,నల్ల నువ్వులు,నల్ల గుడ్డ,నువ్వుల నూనె,,గుర్రపు నాడ విడవవలెను.
  • సనివారం రోజున పంతొమ్మిది సంఖ్య వచ్చే విధంగా దానం చెయ్యాలి.
  • శని సిన్గానాపూర్,తిరునల్లార్,మందపల్లి,నర్సిన్ఘోలె (లేక)మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శని వారం రోజున దర్శించి,పూజలు చేఇంచ వచ్చు.
  • శని వారం రోజు నువ్వులు,అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  • ధునిలో నువ్వులను వేస్తూ,ఇరవయ్ ఆరు ప్రదక్షిణలు చేసేది.
  • ఎనిమిది రోజుల పాటు వరుసగా ప్రవహించే నీటిలో బొగ్గులు వేసి రావాలి.

మా వద్ద నవగ్రహ జప మంత్రములు లభించును.

సంప్రదించండిః-
సెల్ ; 9966455872




ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...